telugu navyamedia
క్రీడలు వార్తలు

అభిమానులకు షాక్ ఇచ్చిన గుజరాత్‌ క్రికెట్‌ సంఘం…

ప్రస్తుతం మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో మొతేరా స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే మిగిలిన మూడు టీ20లకు అభిమానులను అనుమతించకూడదని గుజరాత్‌ క్రికెట్‌ సంఘం నిర్ణయించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే ఇప్పటికే టిక్కెట్లు కొనుక్కున్న అభిమానులకు డబ్బులు వెనక్కిచ్చేస్తున్నట్లు గుజరాత్‌ క్రికెట్‌ సంఘం తెలిపింది. ‘టిక్కెట్లు కొనుక్కున్న వారికి డబ్బులు తిరిగిస్తాం. కాంప్లిమెంటరీ పాసులు అందుకున్న వాళ్లు స్టేడియానికి రావొద్దని కోరుతున్నాం’ అని ఓ ప్రకటనలో తెలిపింది. టీ20 సిరీస్‌లో తొలి టీ20కి 67200 మంది అభిమానులు రాగా.. రెండో టీ20కి 66352 మంది హాజరయ్యారు. 1,30,000 మంది సామర్థ్యం ఉన్న ఈ మైదానంలో తొలి రెండు మ్యాచ్‌లకు 50 శాతం మంది అభిమానులన అనుమతించిన విషయం తెలిసిందే. ఇక ఇంగ్లండ్‌తో 5 టీ20ల సిరీస్‌ను ఓటమితో మొదలెట్టిన భారత్.. రెండో మ్యాచ్‌లో ఘన విజయంతో లెక్క సరిచేసింది. అయితే ఈ రెండు జట్లు నేడు మూడో మ్యాచ్ లో తలపడనున్నాయి.

Related posts