telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్ మార్చ్ కి .. బాబు మద్దతు..

again friendship of janasena and tdp on screen

గత నాలుగు నెలల నుంచి రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికుల జీవితాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఉపాధి లేక పనులు కరువై… కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో భవన నిర్మాణ కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారు. మనస్థాపానికి గురి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. టీడీపీ అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు జగన్ ప్రభుత్వం పై పలు విమర్శలు చేశారు.ఇసుక కొరత వల్ల రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇసుక కొరత కారణంగా జరిగిన కార్మికులు ఆత్మహత్యలన్ని ప్రభుత్వం చేసిన హత్యలు గానే భావిస్తామని చంద్రబాబు అన్నారు.

ఈ సమస్యపై ఇప్పటికే టిడిపి నేత మాజీ మంత్రి నారా లోకేష్ ఒక రోజు నిరాహార దీక్ష చేయగా, నవంబర్ 3న విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చు నిర్వహించనున్నారు . ఇసుక కొరత సమస్య పరిష్కారం కోసం జనసేన పార్టీ చేపడుతున్న లాంగ్ మార్చ్ కి అన్ని పార్టీల మద్దతు ఇవ్వాలని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్నం లో పవన్ కళ్యాణ్ తలపెట్టిన ర్యాలీకి టీడీపీ మద్దతు ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

Related posts