telugu navyamedia
ఆంధ్ర వార్తలు

యూనిఫాంలో స‌చివాల‌యానికి ఏబీ వెంకటేశ్వరరావు…

ఏపీ సచివాలయానికి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లారు. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన విష‌యం తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎస్ సమీర్ శర్మకు రిపోర్ట్ చేయడానికి వచ్చానని తెలిపారు. తన పోస్టింగ్, పెండింగ్ జీతభత్యాల విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.

పోస్టింగ్ విషయంలో ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. ఏ పోస్టింగుకు తాను అర్హుడినని ప్రభుత్వం భావిస్తుందో.. ఆ పోస్టింగ్ వేయాలని లేఖలో కోరారు.

దీంతో ఏబీవీ పోస్టింగ్‌పై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Related posts