telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో కొత్తగా 618 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఈరోజు భారీగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో 38,069 కరోనా పరీక్షలు నిర్వహించగా, 618 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు (122), నెల్లూరు (100) జిల్లాలను మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లో వందకు లోపే రోజువారీ కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 88, గుంటూరు జిల్లాలో 78, ప్రకాశం జిల్లాలో 76 కేసులు వెల్లడి కాగా… అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఒక పాజిటివ్ కేసును గుర్తించారు.

అదే సమయంలో 1,178 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,47,459 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,20,835 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 12,482 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,142కి పెరిగింది.

Related posts