telugu navyamedia
వార్తలు సామాజిక

ఈ నెల 15 నుంచి దేశీయ విమాన సర్వీసుల పున: ప్రారంభం!

Air India flight

దేశంలో లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అత్యవససర సేవలు మినహా అన్నిసేవలు నిలిచిపోయాయి. ప్రజా రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. గూడ్స్, నిత్యావసర సరుకులు, వైద్య సేవల కోసం మాత్రమే కొన్ని విమానాలు, రైళ్లు నడుస్తున్నాయి. ఈ నెల 14వ తేదీతో లాక్‌డౌన్‌ పూర్తి కావడం, దాన్ని పొడిగించే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాల సమాచారంతో దేశీయ విమాన సర్వీసులు మళ్లీ మొదలు కానున్నాయి.

ఈ నెల 15వ తేదీ నుంచి సర్వీసులు పునరుద్ధరించాలని విమానయాన సంస్థలు భావిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే బుకింగ్స్‌ను కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా సంస్థ మాత్రం ఈ నెల 30వ తేదీ వరకు తమ సర్వీసులను తిరిగి ప్రారంభించబోమని స్పష్టం చేసింది. దేశీయ, విదేశీ మార్గాల్లో అప్పటిదాకా విమానాలు నడుపబోమని చెప్పింది. మిగతా సంస్థలు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి.

Related posts