telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

పుదుచ్చేరి జట్టు కు … మెంటర్ గా .. వెస్టిండీస్‌ ఆటగాడు అల్విన్‌ కాళీచరణ్‌ ..

west indies player as puducherry mentor

రాష్ట్ర క్రికెట్ సంఘం తమ జట్టు మార్గనిర్దేశకుడిగా వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు అల్విన్‌ కాళీచరణ్‌ను నియమించుకుంది. ఈ దేశవాళీ సీజన్ లో ఆయన తన అనుభవాన్ని ఆ జట్టుకు అందించనున్నారు. ఇక టీమిండియా సీనియర్‌ బౌలర్‌ వినయ్‌ కుమార్‌ అతిథి ఆటగాడిగా చేరాడు. కర్ణాటక మాజీ బ్యాట్స్‌మన్‌ జే అరుణ్‌కుమార్‌ ప్రధాన కోచ్‌గా పనిచేస్తారు. అన్ని ఫార్మాట్లలో డీ రోహిత్‌ జట్టుకు నాయకత్వం వహిస్తాడని పాండిచ్చేరి క్రికెట్‌ సంఘం వెల్లడించింది.

కాళీచరణ్‌ 66 టెస్టులు ఆడారు. 31 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించారు.తొలి ప్రపంచకప్‌ గెలిచిన కరీబియన్‌ జట్టులో ఆయన సభ్యుడు. ‘అన్ని విభాగాల్లో రుషుల, మహిళల క్రికెట్‌ జట్లకు కాళీచరణ్‌ మార్గనిర్దేశం చేయనున్నారు. ఆయన ఉనికి క్రికెటర్లకు ప్రేరణ ఇవ్వనుంది. ఆయన అనుభవం నుంచి వారు ప్రయోజనం పొందుతారు. కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌ ముగియగానే వినయ్‌ కుమార్‌ జట్టులో చేరతాడు’ అని బోర్డు అధికారి తెలిపారు. తమిళనాడు మాజీ బ్యాట్స్‌మన్‌ అరుణ్‌ కార్తీక్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఆటగాడు పరాస్‌ డోంగ్రా అతిథి ఆటగాళ్లుగా రానున్నారు.

Related posts