telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఎంపీ రఘరామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు..

హైదరాబాద్​లోని వైఎస్‌ఆర్ సీపీ రెబల్ నేత‌, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇంటికి నోటీసులు ఇవ్వడానికి మ‌రోసారి ఏపీ సీఐడీ పోలీసులు చేరుకున్నారు. ఈ నెల 17న విచారణకు రావాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు.

గ‌తంలో ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారన్న అభియోగాలతో రఘురామను విచారించిన సీఐడీ, ఆ తర్వాత అరెస్ట్ కూడా చేశారు. అయితే రఘురామ కృష్ణరాజు బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ కేసు విచారణకు సంబంధించి మరోసారి విచార‌ణకు రావాల్సిందిగా రఘురామకృష్ణం రాజు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వ‌నున్నారు.

కాగా..ఏపీలోని తన సొంత నియోజకవర్గం నరసాపురం పర్యటనకు.. గురువారం వెళ్తున్నట్లు ఇప్పటికే రఘురామ ప్రకటించారు. రెండు రోజులపాటు నియోజకవర్గంలో ఉంటానని వెల్లడించారు. ఇప్పుడు సీఐడీ నోటీసులు ఇచ్చేందుకు రావడం చర్చనీయాంశమైంది.

Related posts