telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

టీడీపీ ఎన్నికల బహిష్కరణ పై అంబటి రాంబాబు సెటైర్…

Ambati Rambabu ycp

ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ తీసుకున్న నిర్ణయం పై ఘాటుగా స్పందించారు అంబటి రాంబాబు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది.. కానీ, గత ఏడాది ఎన్నికలను రాజకీయ పక్షాలతో సంప్రదించకుండా అర్ధాంతరంగా ఆపేసినప్పుడు ఎందుకు మాట్లాడ లేదు? పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఎందుకు బహిష్కరించలేదు? అని ప్రశ్నించారు. ఇక, పంచాయతీ ఎన్నికల్లో మేం గెలిచాం.. అయినా టపాసులు కాల్చారన్న అంబటి.. అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల్లో సహకరిస్తారనే ఎన్నికల పెట్టలంటూ అప్పుడు గోల పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పుడు ఓటమి భయంతోనే పారిపోతున్నారని ఎద్దేవా చేశారు అంబటిరాంబాబు.. అంపశయ్య మీద నుంచి టీడీపీని దహన సంస్కారాలు చేస్తున్నారని కామెంట్ చేసిన ఆయన.. . ఇవాళ ఎన్నికలు బహిష్కరించిన చంద్రబాబు.. రేపు పార్టీని కూడా రద్దు చేస్తారని అన్నారు..

Related posts