మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అయితే నెల రోజుల క్రితం వరకు తగ్గుతూ వచ్చిన కేసులు నెల రోజులుగా పెరుగుతుండటం కొంత ఇబ్బందులు పెడుతున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే నాగపూర్ లో లాక్ డౌన్ విధించగా, తాజాగా అకోలా, ఫర్భని జిల్లాల్లో మూడు రోజులపాటు లాక్ డౌన్ విధించాలని అక్కడి అధికారులు నిర్ణయించారు. ఈ జిల్లాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. అలానే పూణేలో ప్రస్తుతం ఆంక్షలు కొనసాగుతున్నాయి. పూణే లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతున్నది. రాత్రి 10 గంటల తరువాత హోటళ్లు, రెస్టారెంట్లు మూసెయ్యాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రాత్రి సమయంలో కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మహాలో పెరుగుతున్న కేసులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. తిరిగి మళ్ళీ కరోనా నిబంధనలను అతిన్తరం చేయనున్నట్లు తెలుస్తుంది.