telugu navyamedia
రాజకీయ వార్తలు

కొలిమిలో యువత భవిష్యత్తు..మోదీ సర్కార్ పై సోనియా ఫైర్

soniya gandhi

కొత్త పౌరసత్వ చట్ట ప్రకంపనలు ఈశాన్య రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాలకు వ్యాపించడంతో కేంద్రం చర్యపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మండిపడ్డారు. నిరసనకు దిగిన విద్యార్థులపై బలప్రయోగం చేయడం చూస్తే మోదీ ప్రభుత్వ పతనం మొదలైందనే విషయం తేటతెల్లమవుతోందని సోనియా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొలిమిలో యువత భవిష్యత్తును నెట్టి మలమలా మాడ్చేస్తోందని ఘాటు విమర్శలు చేశారు.

పాలకులే హింసకు పాల్పడుతుంటే, రాజ్యాంగ విలువలపై దాడులకు పాల్పడుతుంటే, యువకులను చితకబాదుతుంటే ఈ దేశం ముందుకు నడిచేదెలా? అని ఆమె ప్రశ్నించారు. దేశంలో అస్థిరత్వాన్ని వ్యాప్తి చేసి, హింసకు కారణమవుతూ, యువత హక్కులను ఊడలాక్కుంటూ, మతపరమైన హిస్టీరియాను మోదీ సర్కార్ సృష్టిస్తోందని అన్నారు.

Related posts