telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2020 : టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేయనున్న ముంబై

ఈ రోజు ఐపీఎల్ 2020 లో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్ పాయింట్స్ టేబుల్ టాప్ 2 జట్లు అయిన ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్  మధ్య జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. ఈ మ్యాచ్ లో ఏ జట్టు అయితే విజయం సాధిస్తుందో వారు నేరుగా ఫైనల్‌ చేరుతారు. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌ లో గెలిచిన జట్టుతో ఇందులో ఓడిన జట్టు తలపడుతుంది. మరి ఇందులో విజయం సాధించి ఫైనల్‌ కు ఏ జట్టు వెళ్తుంది అనేది చూడాలి.

ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్ (c), రిషబ్ పంత్ (w), మార్కస్ స్టోయినిస్, డేనియల్ సామ్స్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడా, అన్రిచ్ నార్ట్జే

ముంబై : రోహిత్ శర్మ (c), క్వింటన్ డి కాక్ (w), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్-నైలు, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

Related posts