telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వంగవీటి రాధాతో నాదెండ్ల మనోహర్ భేటీ..

టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణతో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఆదివారం ఎన్‌బీవీకే భవన్ లో జనసేన జనవాణి కార్యక్రమ వుంది. ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు అక్కడికి వెళ్లిన మనోహన్ పక్కనే వున్న వంగవీటి రాధా కార్యాలయానికి వెళ్లారు.

నాదెండ్లతో వంగవీటి రాధా ప్రస్తుత రాజకీయ చ‌ర్చ‌లు ఏం చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

నాదెండ్లతో రాధా చర్చలు.. ఏంటి సంగతి.? | Tdp leader vangaveeti radha krishna  meets janasena leader nadendla manohar | TV9 Telugu

ప్రస్తుతం టీడీపీలో వున్న వంగవీటి రాధా.. గత కొంతకాలంగా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. జూలై 4న తన తండ్రి దివంగత వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా ఆయన జనసేన తీర్ధం పుచ్చుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ రోజున విజయవాడ బందర్ రోడ్ లోని రంగా విగ్రహానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని ప్రచారం జరుగుతోంది. అప్పుడే పవన్ సమక్షంలో వంగవీటి రాధా.. జనసేన పార్టీ కండువా కప్పుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ విషయాన్ని రాధా వర్గం గానీ, జనసేన శ్రేణులు కానీ ఖండించకపోవడం.. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ఏకంగా వంగవీటి ఇంటికి వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది.

Related posts