ఏపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మధ్య పోటా పోటీ నెలకొంది. ఇప్పటికే బెజవాడ టీడీపీలో ముసలం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే.. దీనిని స్వయంగా చంద్రబాబు నాయుడు డీల్ చేసి.. సమస్యను కొలిక్కి తీసుకువచ్చారు. ఈ వివాదం ఇంకా టీడీపీని వెంటాడుతూనే ఉంది. ఈ ఘటన మరువకముందే మరో తలనొప్పి టీడీపీ పార్టీకి ఎదురైంది. మహిళా దినోత్సవం వేళ విజయనగరం జిల్లా టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. మున్సిపల్ ప్రచారంలో సహనం కోల్పోయిన అశోక్గజపతిరాజ్…ఏకంగా ఓ మహిళా కార్యకర్తను చెంపపైన కొట్టాడు అశోక్ గజపతిరాజు. పూలు చల్లిందని ప్రచారంలో మహిళ చెంపమీద కొట్టాడు అశోక్ గజపతిరాజు. దీంతో అవమానంగా ఫీల్ అయిన బాధిత మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్ప్పుడు వైరల్ అవుతోంది.
previous post