మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బొడ్రాయి తండా గ్రామంలో మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన తేజవత్ కోమాల్ అనే 55 ఏళ్ళ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. శనివారం ఉదయం మైనర్ బాలిక వారి తోట మిర్చి కళ్ళం దగ్గరికి పోయేచ్చే క్రమంలో కామాంధుడు ఇంటి దగ్గర రాగానే బలవంతంగా మైనర్ బాలికను ఇంట్లోకి ఎత్తుకొని వెళ్లి బలత్కారం చేసే క్రమంలో మైనర్ బాలిక కామందుడితో పోరాటం చేసి బయట పడింది .ఈ విషయం ఎవరికీ చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో రెండు రోజుల నుంచి బాలిక అన్నం తిన కుండ కనీసం నీళ్లు కూడా తాగడం లేదు. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగింది అని బాలికను అడగగా విషయం తెలిసింది. అదే సమయంలో సీసీ కెమెరా ఉండడంతో కెమెరాను ఓపెన్ చేసి చూడగా బాలికా కామాంధుడు ఇంటి నుంచి ఏడుస్తూ బయటికొస్తున్న ఆధారంగా విషయం బయటకు పొక్కింది. వెంటనే తండా వాసులు కామాంధుడికి స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన డోర్నకల్ మండలంలో సంచలనంగా మారింది ఇలాంటి చర్యలకు పాల్పడిన బాధితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
previous post
next post