telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

నాలుగేళ్ళ క్రితం ఇంట్లోనుంచి పారిపోయిన అతను… భర్తతో తిరిగొచ్చాడు… చివరకు…!

Trans

తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం మండల కేంద్రానికి చెందిన చిక్కాల సోమానాయుడు భార్య సావిత్రి అనే మహిళ అమలాపురం ఆర్‌డీఓ కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో, అలాగే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. సావిత్రికి ఓ కుమార్తె, కుమారుడు వేణుగోపాల్ సంతానం. అయితే వేణుగోపాల్ 2016లో ఇంటి నుంచి పారిపోయాడు. అయితే తిరిగి 2018లో యానాంకు చెందిన సూరంపూడి జాన్ ప్రసాద్ అనే వ్యక్తి ఒక మహిళతో మల్కిపురంలోని సావిత్రి ఇంటికి వచ్చాడు. మీరెవరని వారు ప్రశ్నించగా.. ఆ మహిళే వేణుగోపాల్ అని జాన్ ప్రసాద్ చెప్పాడు. వేణుగోపాల్ లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడని పేర్కొన్నాడు. వేణుగోపాల్ పేరు శ్రీనందితగా మార్చామని, తామిద్దరం ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నామని జాన్ ప్రసాద్ వెల్లడించాడు. ప్రస్తుతం యానాంలో ఇద్దరం కలిసి జీవిస్తున్నట్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు విస్తుపోయారు. ప్రస్తుతం తామిద్దం అన్యోన్యంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. తీన్‌మార్, రికార్డింగ్ డాన్సులతో నందిత బాగానే సంపాదించిందని పేర్కొన్నారు. ఈ డబ్బుతో రూ. 10 లక్షలతో పాంచి యానాంలో స్థలం, రూ. 2 లక్షలతో బంగారం కొన్నామని, ప్రస్తుతం కాకినాడలో ఇల్లు కూడా కొంటున్నట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం కొంత డబ్బు సర్దుబాటు చేయాలని కోరగా, సోమానాయుడు, సావిత్రి కూడబెట్టుకున్న రూ. లక్ష ఇచ్చారు. తర్వాత వాద్దరూ కొన్ని రోజులు ఉండిపోయారు. దీని తర్వాత తరచూ నందిత ఫోన్ చేస్తుండేది.

ఈ నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరి 11న సావిత్రి భర్త సోమానాయుడు చనిపోయారు. ఈ విషయాన్ని సావిత్రి ఫోన్ చేసి చెప్పగా, ఫిబ్రవరి 12న నందిత, జాన్ ప్రసాద్ వచ్చి వారం రోజులు ఉండిపోయారు. తర్వాత గతేడాది సెప్టెంబర్ 14న శ్రీనందిత గ్యాస్ సమస్య వల్ల కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో ఉన్నట్లు జాన్ ప్రసాద్ సావిత్రికి ఫోన్ చేశాడు. ఆమె ఆస్పత్రికి వెళ్లగా, నందిత వద్దకు వెళ్లకుండా ఆపేశారు. తర్వాత అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు నందిత మరణించినట్లు చెప్పారు. దీనిపై జాన్‌ను, ఆయన పక్కన ఉన్న హిజ్రాలను గట్టిగా ప్రశ్నించగా, శ్రీనందిత సంపాదించిన డబ్బు, భూములు, బంగారం ఇచ్చేమని చెప్పారు. తర్వాత హిజ్రాల సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు చేశారని చెప్పారు. తర్వాత జాన్ ప్రసాద్ తాను ఎలాంటి డబ్బు ఇవ్వబోనని, ఎవరికైనా చెప్పుకోమని సావిత్రిపై బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె గతేడాది డిసెంబర్ 16న మల్కిపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై చర్యలు తీసుకోకపోవడంతో అమలాపురం ఆర్డీవోకు విన్నవించింది. తిరిగి డిసెంబర్ 30న మల్కిపురం ఎస్‌ఐకు సావిత్రి ఫిర్యాదు చేసింది. వేణుగోపాల్‌ను ట్రాన్స్‌జెండర్‌గా మార్చి, సరైన వైద్యం చేయించకుండా మరణానికి కారణమైన వారిని శిక్షించాలని, అలాగే తన కుమారుడి (శ్రీనందిత) సంపాదన తనకు దక్కేలా చర్యలు తీసుకోవాలని సావిత్రి కోరింది. దీనిపై మల్కిపురం ఎస్ఐను వివరణ కోరగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు.

Related posts