జూలై 5న కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో నేడు బడ్జెట్ కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రతుల ముద్రణ ప్రారంభానికి ముందు భారతీయ వంటకమైన హల్వాను వండటం కొంతకాలంగా ఆనవాయితీగా వస్తోంది.
దీంతో ఆర్థిక శాఖ కార్యాలయంలో నేడు ‘హల్వా వేడుకను నిర్వహించారు. తొలిసారిగా లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వేడుకను ప్రారంభించి అందరికీ హల్వా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.