telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

తిరుపతికి బండి సంజయ్…

ఏపీలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే  ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు కూడా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రచారం చేయనున్నారు. ఒకటి రెండు రోజుల పాటు తిరుపతిలో పర్యటించనున్నారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరపున ప్రచారం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 14న తిరుపతిలో జరిగే ర్యాలీలో కూడా బండి సంజయ్ పాల్గొనే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇక తిరుపతి ఉప ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ అఫిడవిట్స్ దాఖలు చేశారు. ఆస్తుల వివరాలను వెల్లడించారు. వారిలో బిజెపి అభ్యర్థి రత్నప్రభ రిచ్ అభ్యర్థిగా  ముందున్నారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఆస్తుల విలువ 47.25 లక్షలు. అప్పులు లేవు. ఇక టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఆస్తుల విలువ 10 కోట్ల 23 లక్షల 38 వేల 628 రూపాయలు. ఆదాయ వనరులుగా వ్యవసాయం, పింఛన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. తనపై ఎక్కడా కూడా పోలీసు కేసులు లేవని వివరాలు పొందుపరిచారు. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్‌ ఆస్తుల విలువ 3.27 కోట్లుగా ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ కుటుంబ ఆస్తుల విలువ 24. 68 కోట్లు. ఇందులో రత్నప్రభ పేరిట ఉన్న ఆస్తుల విలువ 19 కోట్ల 57 లక్షల 75 వేల 95 రూపాయలు. ఆమె భర్త పేరున 5 కోట్ల 10లక్షల 77వేల 146రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Related posts