telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మాజీ ఎమ్మెల్యేపై కుష్బూ ఆగ్రహం…

ప్రస్తుతం మంన దేశంలో ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒక్కటి. అయితే ఈ ఎన్నికల కోసం అక్కడ ప్రచారం జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ ఎన్నికలో బీజేపీ తరఫున థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన నటి ఖుష్బూ సుందర్ కూడా తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. తాను ఎన్నికల్లో విజయం సాధిస్తే.. నియోజక వర్గంలో పుట్టే ప్రతి ఆడపిల్ల పేరుమీద లక్ష రూపాయలను డిపాజిట్ చేస్తానని రీసెంట్ ఆమె హామీ ఇచ్చారు. బ్రూణహత్యలను నివారించేందుకు నగదు సాయం చేస్తానని తెలిపారు. ఇదిలావుంటే, ఆమె ఇటీవల ప్రచార సభలో మాట్లాడుతూ.. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈ  నియోజకవర్గంలో పలు సమస్యలు వున్న పట్టించుకోలేదని ఆగ్రహంగా మాట్లాడారు. పక్కనున్న ఓ నేత కాస్త చెప్పే ప్రయత్నం చేస్తున్న ఇవేవీ పట్టించుకోని ఖుష్బూ మాజీ ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. ప్రజలనుంచి వస్తున్న రెస్పాన్స్ తో కుష్బూ మరింత రెచ్చిపోయి మాట్లాడారు. ఈ క్రమములో వెనుక నుంచి ఓ నేత.. ‘మేడం.. ఆ మాజీ ఎమ్మెల్యే సెల్వం మీ పక్కనున్న ఆయనే’ అని ఖుష్బూ చెవుల్లో తెలియపరిచాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Related posts