telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌ ప్రభుత్వంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు !

కేసీఆర్‌ ప్రభుత్వంపై వైఎస్‌ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల దినోత్సవం సందర్భంగా లోటస్‌ పాండ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సమాజంలో మహిళల ప్రాతినిధ్యం ఎంత?.. ప్రత్యేక రాష్ట్రంలో మహిళలకు ఘోరంగా అన్యాయం జరిగిందని కేసీఆర్‌ ప్రభుత్వంపై వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు మహిళలకు మంత్రులకు అవకాశం కల్పించారని.. తెలంగాణలో మహిళకు మంత్రి పదవి దక్కడానికి ఐదేళ్లు పట్టిందని మండిపడ్డారు వైఎస్ షర్మిల. మహిళల త్యాగాలని గుర్తించాలని కాదు.. కిరీటాలు పెట్టాలని కాదు.. సొంత ఇళ్లలోనే మహిళకు గౌరవం లేదు.. మహిళల్లోనే మార్పు రావాలి షర్మిల అభిప్రాయపడ్డారు. అవసరం అయినప్పుడు పోరాటం చేయాలని.. అవకాశాలు మనమే సృష్టించాలి, అవసరం అయినప్పుడు నడుం బిగించాలి మార్పు సాధించాలని పేర్కొన్నారు షర్మిల. సొంత ఇళ్లలోనే మహిళకు గౌరవం లేదని షర్మిల అన్నారు.

Related posts