విజయవాడలో నిన్న రాత్రి సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ల కు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. పౌరసత్వం నిరూపించుకోలేని భారతీయులను నిర్బంధ కేంద్రాలకు పంపుతారా? అని ఆయన సభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఈ సభకు వందలాది మంది తరలివచ్చారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ఫొటో పోస్ట్ చేసిన అసదుద్దీన్ ఒవైసీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఓ విజ్ఞప్తి చేశారు. ఎన్పీఆర్ ప్రక్రియను నిలిపివేయాలని మేము జగన్ను కోరుతున్నాం’ అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు.