telugu navyamedia
వార్తలు

ఆ ప్రక్రియను నిలిపివేయాలని జగన్‌కు అసదుద్దీన్ విజ్ఞప్తి

asaduddin owisi

విజయవాడలో నిన్న రాత్రి సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ల కు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ భారీ బహిరంగ సభ నిర్వహించారు. పౌరసత్వం నిరూపించుకోలేని భారతీయులను నిర్బంధ కేంద్రాలకు పంపుతారా? అని ఆయన సభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఈ సభకు వందలాది మంది తరలివచ్చారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ఫొటో పోస్ట్ చేసిన అసదుద్దీన్‌ ఒవైసీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఓ విజ్ఞప్తి చేశారు. ఎన్పీఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని మేము జగన్‌ను కోరుతున్నాం’ అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు. 

Related posts