కేంద్ర మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత కిల్లి కృపారాణి ఈరోజు ఉదయం లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో భేటీ భేటీ అయ్యారు. ఫిబ్రవరి 28న అమరావతిలో జగన్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్లు ఆమె ప్రకటించారు. వైస్సార్సీపీలో కృపారాణి చేరిక ఖాయమైన నేపథ్యంలో జిల్లా వైసీపీలో అసంతృప్తి భగ్గుమంది.
కిల్లి కృపారాణి వైసీపీలో చేరడాన్ని ధర్మాన ప్రసాదరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రశాంతంగా ఉన్న జిల్లా వైసీపీలో కృపారాణి రాకతో వర్గ విభేదాలు తలెత్తాయి. అయితే ధర్మాన వర్గం అసంతృప్తిపై కిల్లి కృపారాణి స్పందించారు. ధర్మాన… తన చేరికపై వ్యతిరేకంగా ఉన్నారా లేరా అనేది తనకు అనవసరం అని ఆమె అన్నారు. ఆయన మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీ కోసం జిల్లాలో తమ శక్తిమేర కృషి చేస్తానని కృపారాణి స్పష్టం చేశారు.