సీనియర్ నటుడు నరేశ్ పెళ్లి వార్త మరోసారి వార్తల్లో నిలిచింది. తెలుగు, కన్నడ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి పవిత్రా లోకేశ్ ను నరేశ్ నాలుగో వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు తెరపైకి వచ్చాయి.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ..రమ్య చెప్పేదంత అబద్ధమని, ఆమె తన కుటుంబాన్ని నాశనం చేసిందన్నారు. ‘రమ్య చెప్పిన దాంట్లో నిజం లేదు. గతంలో తను నా దగ్గర నుంచి రూ. 50 లక్షల వరకు డిమాండ్ చేసింది. కృష్ణగారు చెబితే రూ. 10 లక్షలు ఇచ్చాను. బ్లాక్ మెయిల్ చేసి నా దగ్గర నుంచి ఎలాగైనా డబ్బు తీసుకోవాలని ఆమె ప్రయత్నిస్తోంది. 200లకు పైగా సినిమాలు చేశాను. 100 మందికి పైగా హీరోయిన్స్తో వర్క్ చేశాను.
కానీ ఎప్పుడు నాపై ఇలాంటి ఆరోపణలు రాలేదు. నేను ఏలాంటి వాడినో అందరికి తెలుసు. అయినా ఇప్పటికే చాలా సార్లు చెప్పాను.
పవిత్రా లోకేశ్తో కలిసి సినిమాల్లో నటించానని, తాను మానసికంగా కుంగిపోయినపుడు పవిత్రా లోకేశ్ అండగా నిలిచారని చెప్పారు. నాకు పవిత్ర కు మధ్య ఎమోషనల్ కనెక్ట్ మాత్రమే.. తనకున్న చాలా మంది స్నేహితులు, ఆత్మీయులల్లో ఆమె కూడా ఒకరని.. పవిత్రా లోకేశ్ తనకు ఫిలాసఫర్ గైడ్ అని అన్నారు నరేశ్.
పవిత్ర వచ్చింది నాలుగు సంవత్సరాల క్రితమే. కానీ రమ్య నేను విడిపోయి 8 సంవత్సరాలు అవుతుంది’ అంటూ వివరణ ఇచ్చారు .
మరోవైపు ఆయన మూడో భార్య రమ్య.. నరేశ్ 4వ పెళ్లి వార్తలపై ఫైర్ అయ్యారు. తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రా లోకేశ్ను నరేశ్ పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఆమె ఆరోపించారు.
నరేశ్ తో మూడేళ్లుగా కలిసి లేము. అలాగని విడాకులు తీసుకోలేదు. మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ నరేశ్ ఎలా పెళ్లి చేసుకుంటాడు?’ అని ప్రశ్నించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ నరేష్తోనే ఉంటానని ఆయన తల్లి విజయ నిర్మలకు మాటిచ్చానని, దానికి కట్టుబడి ఉంటానని ప్రముఖ రమ్య రఘుపతి అన్నారు.
డైవోర్స్ అనేది చాలా పెద్ద లీగల్ ప్రాసెస్ అని, దానికి చాలా సమయం పడుతుందన్నారు. జనవరిలో నరేష్ కేసు పెట్టారని, వీటిపై తాను లీగల్ కోర్టులోనే ఫైట్ చేస్తానని ఆమె పేర్కొన్నారు.
రియల్ లైఫ్ లో బిడియం కలిగిన అమ్మాయినే… : రాశిఖన్నా