*హనుమకొండలో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
*బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు పరస్పర దాడి…
*ఇరువర్గాలపై పోలీసులు లాఠీఛార్జీ
*దాడిని అడ్డుకున్న పోలీసులపై దాడి..
హనుమకొండలో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘అగ్నిపథ్ స్కీమ్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు.
దీనిపై స్పందించిన బీజేపీ శ్రేణులు.. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకుల వాహనాలపై దాడి చేశారు. ఇరు వర్గాలను నిలువరించేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేశారు. ఈ క్రమంలో సీఐ దయాకర్ గన్మెన్ గాయాలయ్యాయి. ఆయనను ఆసుపత్రికి తరలించారు.
ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడులతో హనుమకొండ బీజేపీ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.