సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ నేడు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేదపండితులు నమ్రతకు వేద ఆశీర్వచనము చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు.. నమ్రతకు అమ్మవారి ప్రసాదములు, చిత్రపటమును అందజేశారు. అనంతరం ఏపీ సీఎం జగన్ భార్య వైఎస్ భారతితో, మహేష్బాబు సతీమణి నమ్రత భేటీ అయ్యారు. తెనాలి సమీపంలోని బుర్రిపాలెం గ్రామాన్ని మహేష్బాబు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు తండ్రి, సినీ నటుడు కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెం. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్ బాబు ఇప్పటికే పలు అభివృద్ధి పనులు పూర్తి చేయించారు. కొత్తగా కొన్నింటికి శ్రీకారం చుట్టారు. ఈ గ్రామ అభివృద్ధి బాధ్యతలను నమ్రత చూసుకుంటున్నారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లి భారతితో నమ్రత భేటీ అయ్యారు. ఈ గ్రామంలో అభివృద్ధి పనులకు నమ్రత ప్రభుత్వ సహకారం కోరినట్లు తెలిసింది. ‘గ్రామం ఫౌండేషన్’ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు నమ్రత భారతికి వివరించారు.
ఆ వ్యాఖ్యల వల్ల సూసైడ్ చేసుకుందామనుకున్నా… సీనియర్ నటుడు చలపతిరావు