telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజ్యసభ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన జగన్

jagn b froms rajyasabha

రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నూన్న్చి పోటీ చేయనున్న వైసీపీ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ, గుంటూరు నేత అయోధ్య రామిరెడ్డి, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపీ పరిమళ్‌ నత్వానీ రాజ్యసభ నుంచి పోటీ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో వారికి సీఎం జగన్‌ ఈ రోజు బీ-ఫారాలు అందజేశారు. ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌ ఖాతాలో తెలిపారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్య‌స‌భ‌కు పోటీ చేస్తున్న పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఆళ్ల అయోధ్య‌ రామిరెడ్డి, ప‌రిమ‌ళ్ న‌త్వానిల‌కు బీ-ఫారాలు ఇచ్చాను’ అని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు.

Related posts