telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఏం చేయగలిగారు: చంద్రబాబు

chandrababu fire on AP CS again

ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఏం చేయగలిగారని వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేతలపై చూపించిన శ్రద్ధ పాలనపై చూపిస్తే బాగుండేదని అన్నారు. ప్రజావేదిక కూల్చి ఏం సాధించినట్టు అని ప్రశ్నించారు. అక్కడి శిథిలాలు ఇంకా తొలగించలేదని అన్నారు. అమరావతి అంశంపైనా ఆయన సర్కారుపై విమర్శలు చేశారు.

అమరావతి ప్రాజెక్టును ఆపేయాలన్నదే మీ ఆలోచన అని దుయ్యబట్టారు. అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు. మీరు రూపాయి ఖర్చు పెట్టనవసరంలేదు. భూసమీకరణ కోసం ల్యాండ్ పూలింగ్ లో రైతులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని తెలిపారు. ఎవరు ఏ భూమి కొన్నా టీడీపీ నేతల పేర్లు ప్రచారం చేస్తూ బినామీల పేర్లు చెప్పడం దారుణమైన విషయం. ఇది నీచమైన పని. హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసిన భూములు రాజధాని ప్రాంత పరిధిలోకి రావు. వాళ్లు ఏదో చిల్లింగ్ సెంటర్ స్థాపన కోసం భూమి తీసుకున్నారు. ఆ విషయంలోనూ మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారన్నారు.

Related posts