telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోలీసులు సీఎం జగన్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు: లోకేశ్

Nara Lokesh

ఏపీ పోలీసులు సీఎం జగన్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు.శివప్రసాద్ అనే జర్నలిస్టును పోలీసులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. కనీసం నోటీసులు కూడా జారీ చేయకుండా హైదరాబాదులోని అతని నివాస గృహం నుంచే తీసుకెళ్లారని లోకేశ్ వివరించారు.

ఏపీ ప్రభుత్వ విధానాలపై శివప్రసాద్ మాట్లాడాడు. అతడి ఫోన్ ను అక్రమంగా తీసేసుకున్నారు. అతడి కుటుంబం చూస్తుండగానే ఎందుకు కిడ్నాప్ కు గురయ్యాడు? ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించ్కారు. కనీసం ఓ వారెంట్ లేదు, ఓ వార్నింగ్ లేదు. ఈ ఘటన యావత్తు ఆ జర్నలిస్టు కుటుంబం ఆడియో రూపంలో రికార్డు చేసింది. ఈ వ్యవహారంలో జర్నలిస్టు శివప్రసాద్ కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు.

Related posts