‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఆయుధాలు, ఇతర రక్షణ వస్తువులు దేశీయంగానే తయారవనున్నాయి. తాము తీసుకున్న ఈ నిర్ణయం దేశీయంగా రక్షణశాఖ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందని రాజ్నాథ్ అన్నారు. ఈ నిర్ణయం భారత రక్షణ శాఖ పరిశ్రమకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు.
డీఆర్డీవో సాంకేతిక పరిజ్ఞానానికి ఊతం ఇచ్చినట్లు అవుతుందని చెప్పారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి భారత సైన్యం, ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలతో చర్చించి కేంద్ర ప్రభుత్వం ఓ జాబితాను రూపొందించిందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశీయ రక్షణ ఉత్పత్తుల కోసం 2015 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చినట్లు వెల్లడించారు.