telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ వ్యాపారి అపహరణ కేసు .. స్నేహితుడి పనే.. కోటి స్వాహా..

Arrest

తాజాగా నగరంలో సంచలనం సృష్టించిన వ్యాపారి గజేంద్ర అపహరణ కేసునకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. దోమలగూడలోని ఏవీ కాలేజ్ వద్ద ఆదివారం రాత్రి గజేంద్ర కిడ్నాప్ జరిగిందని సీపీ వెల్లడించారు. గజేంద్ర కిడ్నాప్‌నకు స్నేహితుడే సూత్రధారి అని పోలీసులు నిర్ధారించారు. గజేంద్రను అపహరించి రూ.3 కోట్లు డిమాండ్ చేసి, కోటి రూపాయలు వసూలు చేశారని పేర్కొన్నారు.

నిందితులకు డబ్బు అందగానే, గజేంద్రను అబిడ్స్‌లో విడిచి పెట్టారన్నారు. గాయాలపాలైన గజేంద్ర ఆసుపత్రికి వెళ్లిన అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. టాస్క్‌ఫోర్స్‌, సాంకేతిక నిపుణుల బృందం సమన్వయంతో పక్కా ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.35.30 లక్షల నగదు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సీపీ తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని నిందితుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.

Related posts