telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా తిరుగుముఖం పడితే చాలా ప్రమాదం: సీడీసీ

Corona

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆయా దేశాలు స్వీయ చర్యలు చేపడుతున్నాయి. కొన్ని దేశాలు వైరస్ నుంచి బయటపడుతుండగా, మరికొన్ని దేశాలు కొత్తగా కోవిడ్-19 బారిన పడుతున్నాయి. అయితే కరోనా నుంచి బయటపడిన దేశాలు అత్యంత ఆనందం చెందాల్సిన అవసరం లేదు. వైరస్‌ తిరుగుముఖం పడితే చాలా ప్రమాదమని అమెరికాలోని సెంట్రల్‌ ఫర్ డిసీజ్‌ కంట్రోల్‌ (సీడీసీ) అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు చైనా, జపాన్‌, దక్షిణ కొరియాలో మళ్లీ వెలుగు చూస్తున్న కేసుల వార్తలను వారు ఉదాహరణగా చూపుతున్నారు.

కరోనా వైరస్‌ తొలిసారి వెలుగు చూసిన చైనాలోని వూహాన్‌ నగరం కోలుకున్నట్టే కోలుకుని ఇటీవల మళ్లీ కేసు బారిన పడుతున్న విషయం తెలిసిందే. వైరస్‌తో నగరం అతలాకుతమైంది. 76 రోజు లాక్‌డౌన్‌ అనంతరం పదిరోజుల క్రితమే మళ్లీ అక్కడి జనం స్వేచ్ఛాప్రపంచంలోకి వచ్చారు. అంతా బాగుందనుకున్న సమయంలో అక్కడ మళ్లీ బాధితు వెలుగు చూశారు.జపాన్‌, దక్షిణ కొరియాలోనూ ఇదే పరిస్థితి. చలికాలం మొదలయ్యాక కరోనా వైరస్‌ విజృంభిస్తే తట్టుకోవడం చాలా కష్టమని సీడీసీ డైరెక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్‌ హెచ్చరించారు.

Related posts