telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

జమ్ముకశ్మీర్‌ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

kashmir encounter

జమ్ముకశ్మీర్‌ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన పుల్వామా జిల్లా కంగన్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఉగ్రవాదుల కోసం ఆర్మీ సిబ్బంది కంగన్‌ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు.

ఈ క్రమంలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్యఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జమ్ముకశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు.

Related posts