కొండపల్లి రిజర్వు ఫారెస్ట్లో అక్రమ మైనింగ్ పరిశీలనకు టీడీపీ బృందంపై బయలుదేరింది. తిరుగు ప్రయాణంలో విజయవాడ శివారులోని ఓ హోటల్లో భోజనం చేస్తుండగా టీడీపీ బృందంపై వైసీపీ కార్యకర్తలు కొందరు దాడికి దిగారు. వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులే తమపై దాడికి దిగినట్టు టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. బూతులు తిడుతూ తనపై దాడికి పాల్పడినట్టు టీడీపీ నేత నేతలు ఆరోపించారు. మైనింగ్ వ్యవహారాలతోపాటు తమ నాయకుడి జోలికి వస్తే చంపేస్తామని తనను బెదిరించారని పేర్కొన్నారు.
ఈ దాడి ఘటనపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం స్పందించారు. వైసీపీ నేతల అక్రమాలపై వెనకడుగు వేయబోమన్నారు. రిజర్వ్ ఫారెస్ట్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ సీనియర్ నేతల బృందాన్ని కూడా కొండపల్లి అక్రమ మైనింగ్ పరిశీలనకు పంపుతామని తెలిపారు.