ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం మహాబలిపురం బీచ్లో మార్నింగ్వాక్ చేశారు. వాకింగ్, యోగా నిమిత్తం బీచ్ కు వచ్చిన ఆయన, అక్కడి చెత్తను చూసి దిగ్భ్రాంతి చెందారు. ఆపై వెంటనే ఓ సంచీ తీసుకుని వచ్చి, అక్కడున్న ఖాళీ ప్లాస్టిక్ సీసాలు, తాగి పారేసిన కూల్ డ్రింక్ బాటిల్స్, ఐస్ క్రీమ్ కప్పులను ఏరడం ప్రారంభించారు.
సేకరించిన చెత్తను మోదీ కవర్లలో వేస్తూ, వాటిని వరుసగా పేరుస్తూ వెళ్లారు. ఇక ఈ దృశ్యాలను చూసిన లక్షలాది మంది ఆయన భారతావనికి రోల్ మోడలని కొనియాడుతున్నారు. ఈ విషయాన్ని మోడీ తన ట్వీట్లో పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.