telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రభుత్వం పడిపోవడానికే సిద్ధరామయ్యే కారణం: కుమారస్వామి

kumara swamy

కర్నాటకలో ప్రభుత్వం కుప్పకూలిన తరువాత అందుకు కారణం మీరంటే మీరని కాంగ్రెస్, జేడీఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య కారణంగానే రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిందని అన్నారు. రెండు పార్టీలకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, 14 నెలల ప్రభుత్వం పడిపోయి, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

మొత్తం వ్యవహారంపై దాదాపు నెల రోజుల పాటు మౌనంగా ఉన్న కుమారస్వామి తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో సిద్ధరామయ్యపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం పడిపోయిందంటే, అందుకు ఆయనే కారణమన్నారు. తాను ముఖ్యమంత్రిని కావడం ఆది నుంచి ఆయనకు ఇష్టం లేదని, అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసి ఎమ్మెల్యేలను రెచ్చగొట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి వ్యతిరేకంగా సిద్ధరామయ్య పని చేశారన్నారు.

Related posts