వర్షాకాలం ఆరంభమైనప్పటికీ వరుణుడు కరుణించక తెలుగు రాష్ట్రాల్లో చిరుజల్లులు తప్ప భారీ వర్షాలు కురియడం లేదు. తుఫాన్ ప్రభావం వల్ల వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్కు ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం బలపడి జులై 3 నాటికి వాయుగుండంగా మారే అవకాశముందని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.