కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జేడీఎస్ రెడీగా ఉందని కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మంత్రి డీకే శివకుమార్ అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకునేందుకు గడువేమీ లేదని మీడియాకు తెలిపారు. విశ్వాసపరీక్షపై ఇప్పటికే మొదలైన చర్చ ఇవాళ కొనసాగించి సాయంత్రం ఓటింగ్ జరుగుతుందనే అంచనాలున్న నేపథ్యంలో డీకే తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి
ప్రభుత్వం గట్టెక్కుతుందనే నమ్మకం తమకు ఉందని డీకే చెప్పారు. ఇవాళ చోటుచేసుకున్న మరో రెండు పరిణామాలు సైతం విశ్వాసపరీక్షలో మరింత జాప్యం చోటుచేసునే అవకాశాలున్నాయనడానికి బలం చేకూరుస్తున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలు 23వ తేదీ ఉదయం 11 గంటల లోపు తన కార్యాలయానికి వచ్చి కలవాలని కొద్దిసేపటి క్రితమే స్పీకర్ రమేష్ నోటీసులు ఇచ్చారు. మరో వైపు సాయంత్రం 5 గంటలలోపు బలపరీక్ష జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు.
మేం రాజకీయాలను చచ్చినా వదిలిపెట్టం: నాగబాబు