telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణ స్పీకర్ … కు ఆ హక్కు లేదు.. : ఉత్తమ్ ఆరోపణ..

T Congress boycott mlc elections

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ స్పీకర్ కనబడటం లేదని ఆరోపించారు. స్పీకర్‌ ఫోన్‌లో కూడా అందుబాటులో లేరని ఉత్తమ్‌ అన్నారు. స్పీకర్ ఎక్కడ ఉన్నారో చెప్పాలని అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తమ్‌ ఫోన్‌ చేశారు. 12 మంది ఎమ్మెల్యేలకు సీఎల్పీ మీటింగ్ పెట్టే అర్హత లేదని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

సీఎల్పీని విలీనం చేసే హక్కు స్పీకర్‌కు లేదని, జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనం చేస్తారు? అని ఉత్తమ్ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని, కాంట్రాక్ట్‌ల్లో తీసుకున్న డబ్బుతో ఎమ్మెల్యేలను కొన్నారని ఉత్తమ్‌ ఆరోపించారు.

Related posts