telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబుపై మళ్లీ సెటైర్‌ వేసిన విజయసాయిరెడ్డి.. !

Mp vijayasai reddy

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇక ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు, నిమ్మగడ్డలను విజయసాయిరెడ్డి టార్గెట్‌ చేశారు. అయితే.. తాజాగా చంద్రబాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా గల్లంతే అంటూ విజయసాయిరెడ్డి అన్నారు. “జగన్ గారి సంక్షేమపాలనకు పంచాయతీలు పట్టం కడుతున్నాయి. తొలివిడతలో 82 శాతం పంచాయతీలు వైసీపీ మద్దతుదారులు గెలుచుకుంటే రెండో విడతలో అంతకు మించి విజయదుందుభి మోగింది. టీడీపీది పల్లెల్లో 10 శాతం కూడా ఓట్లురాని పరిస్థితి – ఇక ప్రతిపక్ష హోదాకూడా బాబుకు గల్లంతే. ” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక అంతకు ముందు ట్వీట్‌లో “చంద్రబాబు రాష్ట్రపతికి, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాశాడు. పిచ్చి ముదిరి జో బైడెన్, పుతిన్ కు కూడా ఉత్తరాలు రాస్తాడు. ఈ సారి కేంద్ర బలగాలు కాదు, అమెరికా సైన్యం, ఐకాస శాంతి దళం పంపాలని కోరతాడు. చివరకి చిత్తుగా ఓడింది టీడీపీ కాదు, ప్రజలే అంటూ తృప్తి పడతాడు.” అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Related posts