telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఈపీఎస్-95 .. ఇకనుండి కనీస పింఛన్ 3వేలు.. కేంద్రం తాయిలం.. !!

minimum pension willbe 3000 under eps-95

జీతం తప్ప పెన్షన్ లేని వారికి, కనీస భృతి కింద ఇచ్చే మొత్తాన్ని మూడింతలు పెంచేందుకు కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈపీఎస్-95 (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం) ఖాతాదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం అందిస్తున్న వెయ్యి రూపాయల కనీస పింఛన్‌ను మూడువేలకు పెంచాలని యోచిస్తోంది.

అదే జరిగితే దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. మరో రెండు రోజులలో (గురువారం) సమావేశం అవుతున్న ఈపీఎఫ్‌వో ట్రస్టీల బోర్డు (సీబీటీ) ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దానితో పాటు ఈపీఎఫ్ వడ్డీ రేట్లను కూడా బోర్డు ఖరారు చేయనుంది. మార్కెట్లో వడ్డీ రేట్లు పడిపోతున్నప్పటికీ, ఎన్నికల సంవత్సరం కాబట్టి, ఈపీఎఫ్ వడ్డీరేటును మాత్రం 8.55 శాతంగానే ఉంచాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది.

Related posts