telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ట్రోలింగుపై ఆవేదన చెందుతున్నాను… సోషల్ మీడియాకు మరో సెలెబ్రిటీ దూరం

Neha Kakkar

సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతుండడంతో పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాకు దూరమవుతున్నారు. తాజాగా ప్రముఖ గాయకురాలు నేహా కక్కర్ ట్రోల్స్ వల్ల తాను ఇన్‌స్టాగ్రాంతో పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. “ద్వేషం, అసూయ ఉన్నందువల్ల నేను కొన్ని రోజులు దూరంగా వెళుతున్నాను. గుడ్ నైట్… చింతించకండి… నేను నిద్రలోకి తిరిగి వెళుతున్నాను. స్వేచ్ఛ, ప్రేమ, గౌరవం,సంరక్షణ, సరదా ఉన్న మెరుగైన ప్రపంచం ఉన్నపుడు నన్ను మేలుకొలపండి” అని నేహాకక్కర్ పోస్టు పెట్టారు. నేహాకక్కర్ కు 39.6 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ‘‘నేను సోషల్ మీడియాకు దూరంగా ఉండటం ఎవరికైనా చెడుగా అనిపిస్తే నన్ను క్షమించండి. నేను చాలా కాలం నుంచి ట్రోలింగుపై ఆవేదన చెందుతున్నాను. కానీ చెప్పలేకపోయాను’’ అని నేహా పేర్కొన్నారు. ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్‌ సోనాక్షీ సిన్హా ట్విట్టర్‌లో తన ఖాతాను డీ-యాక్టివేట్‌ చేశారు. నెగెటివిటీకి దూరంగా ఉండటం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు సోనాక్షి తెలిపారు. ఇటీవల సుశాంత్‌ ఆత్మహత్య తర్వాత ఆమె చేసిన ట్వీట్స్‌పై విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. ఇప్పటివరకు సోషల్ మీడియా ఖాతాలను విడిచిపెట్టిన సినీనటుల్లో శశాంక్ ఖైతాన్, సాకిబ్ సలీం, ఆయుష్ శర్మ, జహీర్ ఇక్బాల్‌లు ఉన్నారు. తాజాగా పలువురు సెలెబ్రిటీలు సైతం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Related posts