telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

విషాదం : కరోనా తో తెలంగాణ మాజీ మంత్రి మృతి

TRS flag

టీఆర్ఎస్ పార్టీకి వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సోలిపేట రామలింగం, నాయిని, నోముల లాంటి నాయకులను కోల్పోయిన టీఆర్ఎస్.. తాజాగా మరో కీలక నాయకున్ని కోల్పోయింది. తెలంగాణ మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ (66) గురువారం రాటే మరణించారు. కరోనాతో బాధపడుతున్న ఆయన..మూడు రోజుల కింద హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ రాత్రి మరు చెందారు. ఎన్టీఆర్, కెసిఆర్ కేబినెట్ లో మంత్రిగా చందూలాల్ పని చేశారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణలో మంత్రిగా పని చేశారు. మూడు సార్లు శాసనసభకు, రెండు సార్లు లోక్ సభకు చందూలాల్ ఎన్నికయ్యారు. 2014 లో ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియోజక వర్గం నుంచి గెలుపొంది సాంస్కృతిక, పర్యాటక మంత్రిగా పని చేశారు చందూలాల్‌. అయితే ఆయన మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Related posts