telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మోడీ సర్ ఈ కేసులో జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం… సుశాంత్ సోదరి రిక్వెస్ట్

Sushanth

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14న ముంబై, బాంద్రాలో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఆరోపణలు వెల్లువత్తుతున్నాయి. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించిన విచారణలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీకి అతని సోదరి శ్వేత సింగ్ కీర్తి విన్నవించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ‘డియర్ సర్… మీరు సత్యానికి కట్టుబడి ఉంటారని నా మనసు చెపుతోంది. మేము ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాం. బాలీవుడ్ లో అడుగుపెట్టే సమయంలో నా సోదరుడికి ఏ గాడ్ ఫాదర్ లేరు. ఇప్పుడు కూడా మాకు ఎవరూ లేరు. మీరు వెంటనే ఈ కేసులో జోక్యం చేసుకోవాలని కోరుతున్నాం. విచారణ నిష్పక్షపాతంగా కొనసాగేలా చూడాలని విన్నవిస్తున్నాం. సాక్ష్యాలు నాశనం కాకుండా చూడాలని ప్రాధేయపడుతున్నాం. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని మోదీకి శ్వేత విన్నవించారు.

Related posts