సీబీఐ డైరెక్టర్ అలోక్వర్మకు ఉద్వాసన పలికిన ప్రధాని మోదీ నేతృత్వంలోని అత్యున్నత కమిటీ వారం రోజుల వ్యవధిలోనే మరో నలుగురు అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాతోపాటు మరో ముగ్గురు అధికారుల పదవీ కాలాన్ని తగ్గించివేసింది.వీరిలో అలోక్వర్మతో గొడవ పెట్టుకున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా కూడా ఉన్నారు.
అలోక్వర్మతో అసాధారణ రీతిలో ఘర్షణకు దిగిన ఆస్తానాను కేంద్రం గత అక్టోబర్లో నిర్బంధ సెలవుపై పంపించిన సంగతి తెలిసిందే. తాజాగా అస్థానాతోపాటు జేడీ అరున్ కుమార్ శర్మ, డీఐజీ మనీశ్ కుమార్ సిన్హా, ఎస్పీ జయంత్ నైక్నవారేల పదవీకాలాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.