విశాఖపట్టణంలో తన పేరు మీద భూములుంటే దేనికైనా సిద్దమేనని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. విశాఖలోఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అక్కడ మంత్రి బొత్సకు భూములు ఉన్నాయని, దీనిపై సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై బొత్సను ప్రశ్నించగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గతంలో వోక్స్ వ్యాగన్ కుంభకోణంపై తనకు ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేశారని, దీనిపై దర్యాప్తు చేసిన సీబీఐ తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పిందని గుర్తుచేసుకున్నారు. తానేమీ పేదవాడిని కాదని, విజయనగరంలో తనకు భూములు ఉన్నాయని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు