telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతిని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించా: చంద్రబాబు

chandrababu

 వైసీపీ సర్కారు అనుసరిస్తున్న విధానాల పై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వ తీవ్రవాదాన్ని తట్టుకోలేకపోతున్నామని పారిశ్రామికవేత్తలే చెబుతున్నారని చంద్రబాబు వెల్లడించారు.

హైదరాబాద్ కు దీటుగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించానని చెప్పారు. హైటెక్ సిటీని మించిన సిటీలను రాష్ట్రంలో అభివృద్ధి చేయాలనుకున్నామని తెలిపారు. ఒక్కో ఇటుక పేర్చి సాధ్యమైనంత మేర రాజధానిని అభివృద్ధి చేశామని అన్నారు. ప్రస్తుతం మొత్తం రివర్స్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts