telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన ఖరారు.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల రోజు దగ్గర పడుతున్న వేళ ప్రధాన పార్టీలను ప్రచారం ముమ్మరం చేశాయి.

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ తెలంగాణలో పర్యటించనున్నారు.

ఆయన రాష్ట్ర పర్యటనకు సంబంధించిన ప్రయాణ ప్రణాళిక ఖరారైంది. మే 8, 10 తేదీల్లో ఆయన తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటారు.

8వ తేదీన వేములవాడ, వరంగల్‌లో జరిగే సభల్లో ప్రసంగించడం, 10వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ కార్యక్రమంలో మోదీ ప్రధాన వక్తగా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రధాని ప్రచారం:

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించడం ఖాయమైంది.

ఈ నెల 3, 4 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. 3వ తేదీన పీలేరు, విజయవాడలో మోదీ పర్యటన ఉంటుంది. మధ్యాహ్నం 2:45 గంటలకు పీలేరులో, అలాగే సాయంత్రం 6:30 గంటలకు విజయవాడలో రోడ్‌షో నిర్వహించనున్నారు.

మరుసటి రోజు 4వ తేదీన రాజమండ్రి, అనకాపల్లిలో పర్యటించనున్నారు. మోడీ పర్యటనలో మధ్యాహ్నం 3:45 గంటలకు రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లి పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Related posts