దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుపోతున్నాయి. తెలుగురాష్ర్టాల్లో కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది.
సామాన్యులతో పాటు వరుసగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్లోకి వెళ్లారు.
తాజాగా అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జీ పరిటాల శ్రీరామ్కు కరోనా సోకింది. పాజిటివ్గా నిర్థారణ అయిందని సోషల్ మీడియా ద్వారా ఆయన తెలిపారు.
కరోనా పరీక్షలో స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందని పరిటాల శ్రీరామ్ తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు అందరూ జాగ్రత్తగా ఉండాని సూచించారు. ఏవైనా లక్షణాలు కన్పిస్తే వెంటనే టెస్టులు చేయించుకోవాలని అని పరిటాల శ్రీరామ్ కోరారు.
— Paritala Sreeram (@IParitalaSriram) January 14, 2022