telugu navyamedia
సినిమా వార్తలు

భోగి స్పెషల్..దోశను ఉప్మా చేసిన చిరంజీవి..

పండగ అంటే చాలు మెగా ఫ్యామిలీ అంతా ఒకేచోట చేరి ఆనందంగా సెలబ్రేట్​ చేసుకున్నారు. తాజాగా భోగి పండుగ‌ పురస్కరించుకుని మెగా బ్రదర్స్‌ కుటుంబాలు ఒకేచోట చేరాయి. అయితే తాజాగా వరుణ్ తేజ్ ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో ఫన్నీ సంఘటన జరిగింది. ప్ర‌స్తుతం అది కాస్తా వైరల్‌గా మారింది.

ఇక సంక్రాంతి స్పెషల్‌గా ఆరుబయట భోగి మంట ఏర్పాటు చేసి కూర్చున్న ఫ్యామిలీ మెంబర్స్‌ కోసం చిరంజీవి, వరుణ్‌ తేజ్‌ చెఫ్‌ మాస్టర్లుగా మారారు. తమ కుటుంబ సభ్యుల కోసం సరదాగా దోసెలు వేస్తూ వడ్డించారు.

అయితే తన కంటే వరుణ్ వేసిన దోసె బాగా రావడంతో ‘అది సరిగా రాలేదు, నాకు కుళ్లు వచ్చేసింది. ఇది దోశ కాదు ఉప్మా’ అంటూ వరుణ్‌ వేసిన దోశను చెడగొట్టాడు చిరు. బాస్‌తో 101వ దోశ అన్న క్యాప్షన్‌తో వరుణ్‌ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

ప్రస్తుతం చిరంజీవి.. ఆచార్య, గాడ్​ఫాదర్, భోళా శంకర్, బాబీ దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. వరుణ్​తేజ్ ‘గని’ రిలీజ్​ కావాల్సి ఉంది. వైష్ణవ్​తేజ్.. ఓ సినిమాలో నటిస్తున్నారు.

Related posts