telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పది పరీక్షలు రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నా: కన్నా

Kanna laxminarayana

ఏపీలో వైసీపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు రద్దు చేయడం తెలిసిందే. అటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేసి ఫెయిలైన వాళ్లందరినీ పాస్ చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ నిన్న స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు.

ప్రజాప్రయోజనాల పరిరక్షణ విషయంలో బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని ఉద్ఘాటించారు. కరోనా విపత్తు కారణంగా రాష్ట్ర విద్యార్థుల శ్రేయస్సు, భద్రతను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షలు రద్దు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశానని తెలిపారు. ఆ లేఖకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరీక్షలు రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ట్వీట్ చేశారు.

Related posts