telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రగతి భవన్ కు చేరుకున్న కేసీఆర్

KCR cm telangana

తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్ లోని  ప్రగతి భవన్ కు చేరుకున్నారు. గత రెండు వారాలుగా ఆయన ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో ఉన్నారు. కరోనా పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన రైతులతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

మరోవైపు కేసీఆర్ ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కనబడటం లేదనే వార్తలు హల్ చల్ చేశాయి. ‘వేర్ ఈజ్ సీఎం’ అంటూ ఇద్దరు యువకులు ఏకంగా ప్రగతి భవన్ వద్ద మెరుపు వేగంతో నిరసన తెలిపి, మాయమయ్యారు. ఈ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, కేసీఆర్ ఎక్కడ అంటూ ఏకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. 

Related posts